- Advertisement -
నవతెలంగాణ-మద్దూరు
చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఈనెల 25న జరిగే బందును విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఏసీ పిలుపుమేరకు మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి, దూల్మిట్ట, మండలాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా బందులో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అందె అశోక్, అందే బీరయ్య, బుట్టి సత్యనారాయణ, బస్వగళ్ల సిద్ధయ్య, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, గడిపే రవి, కొండ్ర మల్లేష్, బంగ్లా భూపతి రెడ్డి, కర్రె నర్సిరెడ్డి,బాలేశ్వర్, మనోజ్, ఫసి మహమ్మద్, నవీన్, యాదగిరి, కనకయ్య, పోశయ్య, యూసుఫ్, శ్రీనివాస్, ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -