- Advertisement -
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి నస్పూరి నాగరాజు అనారోగ్యంతో మృతి చెందడం కాంగ్రెస్ కు తీరని లోటని మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. సోమవారం నాగరాజు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబాన్ని పరమార్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంగో సునీత,పిల్లల శ్రీనివాస్ ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాలను పరమార్షించి సన్నబియ్యం అందజేసి ఆర్థిక సాయం చేశారు.
- Advertisement -