- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తోపాటు.. మరో ముగ్గురు జైలు వార్డర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.
కడప జైల్లో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై నాలుగు రోజులపాటు కడప జైల్లో డిఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురుపై సస్పెన్షన్ వేటు పడింది.
- Advertisement -