Saturday, August 2, 2025
E-PAPER
Homeవరంగల్నియామక పత్రాన్నిఅంద‌జేసిన మంత్రి శ్రీధర్‌బాబు

నియామక పత్రాన్నిఅంద‌జేసిన మంత్రి శ్రీధర్‌బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు:
తెలంగాణ రాష్ట్ర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కౌన్సిల్ మెంబర్ గా దండు రమేష్ ను నియ‌మించిన విష‌యం తేలిసిన‌దే, దానికి సంబందించిన నియామ‌క ప‌త్రాన్ని బుద‌వారం రోజు హైద్రాబాద్ లోని త‌న చాంబ‌ర్ లో దండు రమేష్ కు మంత్రి అంద‌జేసారు.ఈ సంధర్బంగా శ్రీధర్ భాబు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో సక్రమంగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లు,ప్రాజెక్ట్ డైరెక్టర్లు ,ఇతరసిబ్బందితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగయిన సేవాలందించాలని చూసించడం జరిగింది. అనంత‌రం దండు రమేష్ ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
ఈ సంధర్బంగా దండు రమేష్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద‌న్య‌వాదాలు తేలుపుతూ పూల బొకే ఇచ్చి శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్తమలో డి.సి.సి. జెనరల్ సెక్రటరీ కుంభం స్వప్న రెడ్డి, వొన్న తిరుపతి రావు తాడిచెర్ల పి ఏ సి ఎస్ డైరెక్టర్, కాటారం మాజీ ఎంపిపి పంథకాని సమ్మయ్య, ప్రచార కమిటీ ఛైర్మన్ కుంభం రమేష్ రెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు ఆకుల శ్రీనివాస్, మాజీ వార్డ్ సభ్యులు కుంట సదానందం, తాడిచెర్ల గ్రామ శాఖ అధ్యక్షులు కేసారపు చంద్రయ్య, త్రిపైరనేని వంశీ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -