- Advertisement -
న్యూఢిల్లీ : బ్రిటన్ బ్రాండ్ బీఎస్ఏ మోటార్ సైకిల్స్ కొత్తగా భారత మార్కెట్లోకి స్క్రాంబ్లర్ 650, బాంటమ్ 350 మోడళ్లను విడుదల చేసింది. వీటిని ఆధునిక ఇంజనీరింగ్తో మేళవించి అందుబాటులోకి తెచ్చినట్టు ఆ కంపెనీ తెలిపింది. స్క్రాంబ్లర్ 650 బలమైన 652 సీసీ ఇంజిన్ం సామర్థ్యంతో వస్తుందని తెలిపింది. ఇది రైండర్ల సాహస భావాన్ని ప్రతిబింబిస్తుందని క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా పేర్కొన్నారు. కాగా.. వీటి ధరలను ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ స్క్రాంబ్లర్ 650 ధర రూ.6.99 లక్షలుగా, బాంటమ్ 350 ధర రూ.4 లక్షలుగా ఉండొచ్చని తెలుస్తోంది.
- Advertisement -