- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మరో 3 వారాల్లో రిటైర్మెంట్. పదవీ విరమణ అయ్యేలోపు జాక్ పాట్ కొట్టాలని అనుకున్నాడు. ఓ సంస్థకు రూ.35 కోట్ల బిల్లులు మంజూరు కోసం గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ సబ్బవరపు శ్రీనివాస్ రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశాడు. ఆ సంస్థతో ట్రాప్ చేసిన ఏసీబీ రూ.25 లక్షలు తీసుకుంటుండగా విజయవాడలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అయితే గతంలోనే 2 సార్లు ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.
- Advertisement -