- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్దకు గవర్నర్, సీఎం వెళ్లి పలకరించారు.
- Advertisement -