- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామ రహదారిపై వర్షపు నీరు చేరి, వరద ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాధవీలత, ఎమ్మార్వో ప్రమీల కలిసి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. రహదారి దెబ్బతినకుండా మట్టిని పోయిస్తూ, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడానికి బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయితీ కార్యదర్శికి ఆర్డీవో ఆదేశించారు. ఈ పరిశీలనలో మాజీ సర్పంచ్ గుండెమోని లింగమయ్య, పెద్దలు మల్లయ్య బాల్ రెడ్డి, గుద్దటి బాలరాజు, సైదులు, శ్రీనుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -