Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నేషనల్ యోగ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన కలెక్టర్

నేషనల్ యోగ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని  పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం భువనగిరి పాఠశాలలో అంగరంగ వైభవంగా  54వ కేవీఎస్ నేషనల్ యోగా స్పోర్ట్స్ మీట్ – 2025 ను జిల్లా కలెక్టర్, విద్యాలయ చైర్మన్  హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్  ఎన్ చంద్రమౌళి  మాట్లాడుతూ 54వ కేవీఎస్ నేషనల్ యోగా స్పోర్ట్స్ మీట్ – 2025 పోటీలు 19 ఆగస్టు నుంచి 23 ఆగస్టు వరకు5 రోజుల పాటు జరుగుతాయనీ,  దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొనబోతున్నారు” అని తెలిపారు.

కేంద్రియ విద్యాలయ సంఘటన్ యొక్క 25 రీజియన్ల నుండి 350 మంది విద్యార్థులు, 50 మంది ఎస్కార్ట్ టీచర్స్,  10 మంది జడ్జీలు ఈ క్రీడల్లో పాల్గొంటారని, కేవీఎస్ రీజినల్ ఆఫీస్ హైదరాబాద్ నుండి వచ్చిన అధికారుల బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందనీ, ప్రారంభ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది హాజరై, కార్యక్రమాన్ని  విజయవంతంగా ప్రారంభించినట్లు తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad