- Advertisement -
నవతెలంగాణ భద్రాచలం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 7 గంటలకు నీటిమట్టం 42.6 అడుగులకు చేరింది. ఈ నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద పెరగడంతో భద్రాచలం కల్యాణకట్ట వరకు నీరు వచ్చి చేరింది. నీటిలోకి ఎవరూ వెళ్లకుండా గజ ఈతగాళ్లు, లాంచీలను ఏర్పాటుచేశారు.
- Advertisement -