నవతెలంగాణ-కొడంగల్
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రం సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆల యం దగ్గర మినీ ట్యాంకు బండ్ పై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొీ నడంతో ఒకరు అక్క డికక్కడే మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాల య్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంగాయిపల్లి గ్రామానికి చెందిన షేక్ షాబుద్దీన్, రాములు ఇద్దరు కలిసి వ్యక్తిగత పని నిమిత్తం దౌల్తాబాద్ నుంచి కొడంగల్ వెళుతుండగా నందరంకు చెందిన ప్రకాష్ , శంకరమ్మ నందారం నుంచి దౌల్తాబాద్ వస్తున్న క్రమంలో ఎదురుఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ఢీకొీనడంతో షేక్ షాబుద్దీన్ (38) అక్కడికక్కడే మృతి చెందాడు. శంకరమ్మ, ప్రకా ష్, రాములుకు తీవ్రగాయాలు కావడంతో కొడంగల్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.