నవతెలంగాణ – కంఠేశ్వర్
ఆగస్టు 25 (సోమవారం) ఉదయం 10:30 గంటలకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ డివిజన్ మహాసభ నిర్వహిస్తున్నమని జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభలో నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మహాసభకు రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ గడ్డం అశోక్ హాజరవుతున్నారు. అనేక ముఖ్యమైన పెన్షనర్ల సమస్యల గురించి చర్చించటం కూడా జరుగుతుంది. ఈ సభలో అధ్యక్షులు రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వి ఎల్ నారాయణ, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ తదితరులు కూడా హాజరవుతున్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవిల్ నారాయణ, జిల్లా నాయకులు పురుషోత్తం అమీదుద్దీన్ ఘంటా నరేందర్, శిల్ప లింగయ్య, బాల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 25న నిజామాబాద్ డివిజన్ మహాసభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES