- Advertisement -
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పొలాల అమావాస్య పురస్కరించుకుని జిల్లాలో రెండు రోజులుగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం జిల్లా జైలులోను పొలాల పండుగ వేడుకలను జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జైలులో ఉండే పశువులకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జైలర్ సూర్య ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ జైలర్ రాథోడ్ ప్రకాష్ సిబ్బంది ఎస్ఓపి ఖైదీలు పాల్గొన్నారు.
- Advertisement -