నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల జాతీయస్థాయిలో బెస్ట్ స్కూల్ అవార్డుకు ఎంపికై ప్రముఖులచే ప్రశంసలు పొందినట్టు పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ఆదివారం తెలిపారు. ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన జాతీయస్థాయిలో బెస్ట్ స్కూల్ అవార్డులో స్కూల్ అవార్డు సెలెక్ట్ కావడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ పాఠశాల జాతీయ స్థాయిలో ద బెస్ట్ స్కూల్ అవార్డు పొందడం చాలా గర్వకారణంగా ఉందనీ, తమ పాఠశాలలో అన్ని రంగాల్లోనూ ముందుండాలనేదని తన కోరిక తమ విద్యార్థులకు ఉన్నత స్థాయిలో విద్య అందించడం కోసం తను ఇంతటి కృషి అయినా చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత సమాజానికి తగినట్టుగా విద్యాబోధన మెరుగుపరుచుకునే విధంగా ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నామని అన్నారు. దానికి ఫలితంగానే జాతీయస్థాయిలో ద బెస్ట్ స్కూల్ అవార్డు పొందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణను, పాఠశాల ప్రిన్సిపల్ దాస్, ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు.
జాతీయస్థాయిలో ద బెస్ట్ స్కూల్ అవార్డు పొందిన లిల్లీపుట్ పాఠశాల..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES