Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుమట్టి విగ్రహాలను పంపిణీ చేసిన అదనపు కలెక్టర్

మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన అదనపు కలెక్టర్

- Advertisement -

అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు
నవతెలంగాణ – భువనగిరి

సమాజంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాలు పూజించి కంకణ బద్దులు కావాలని స్థానిక సంస్థల పదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు భాస్కరరావు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మట్టి వినాయకునికి వాడటం వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి లోపలతో పాటు వివిధ మండపాలలో భారీ విగ్రహాలను మట్టితో చేయించినప్పుడు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్  అవైస్ చిస్తీ,  మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం, అధికారులు, నాయకులు, సిబ్బంది,  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad