- Advertisement -
నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్
వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 సంవత్సరంకి గాను ట్రాక్టర్ తో నడిచే వ్యవసాయ పరికరాలు, స్ప్రేయర్లు, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్, ఇతర వ్యవసాయ సంబంధిత పనికరాలు సబ్సిడీ పై కావలసిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి సెప్టెంబర్ 9 తారీకు లోపల దరఖాస్తులు అందజేయాలనీ వ్యవసాయ అధికారి నీ శృతి గురువారం తెలిపారు. వానకాలం 2025 సీజన్ “పంట నమోదు”ప్రక్రియ ప్రారంభం అయింది. కావున రైతు సోదరులు పంట వివరాలు అందించడం లో సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు సహకరించగలరాని కోరారు.
- Advertisement -