ఆర్టీఐ నాయకులు.. చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, చింతల కుమార్ యాదవ్..
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆర్టీసీ రథచక్రాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం కావాలంటే ప్రయాణికులే కీలకం కాబట్టి, ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు, ఆర్టీసీ సంస్థ డ్రైవర్లకు సెల్ఫోన్ వాడకాన్ని నిషేదించాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాటారం కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ శనివారం ప్రభుత్వానికి, ఆర్టీసీ సంస్థకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మాట్లాడారు. విది నిర్వహణలో ఉన్న డ్రైవర్ తన వద్ద సెల్ఫోన్ కలిగి ఉండకుండా చూడడం ద్వారా ప్రయాణం సురక్షితంగా సాగుతుతొందని పేర్కొన్నారు. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడటం, వల్ల జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా నిబంధన అమలు చేయాలన్నారు.
ఆర్టీసీ డ్రైవర్లకు సెల్ ఫోన్ల వాడకం నిషేధించాలి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES