- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పిటిసి తుది ఓటరు జాబితా ప్రచూరించామని ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికల కోసం ఎంపీటీసీ, జడ్పిటిసి పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ఎంపీడీవో కార్యాలయంలో ప్రచురించామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండె వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బలరాం గౌడ్, తదితరులు ఉన్నారు.
- Advertisement -