- Advertisement -
16 సంవత్సరాలు దేశ సేవలో పోసానిపేట్ వాసి
నవతెలంగాణ -రామారెడ్డి
మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన గండ్ర అంజయ్య 2009 నుండి 2025 వరకు 16 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్డ్ కావడంతో, గ్రామ మున్నూరు కాపు సదర్ సంఘం ద్వారా శనివారం శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా గండ్ర అంజయ్య మాట్లాడుతూ…. దేశ సేవ చేయడం నా అదృష్టమని, యువత దేశ సేవ కోసం ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యక్షులు గoడ్ర నర్సింలు, ఉపాధ్యక్షులు బండి పోచయ్య, కోశాధికారి తoకరి లింగం, బలగం వెంకట్ రాములు, తoకరి రవి, ఈరా గంగరాజం, బండి నరేష్, చిందం వసంత్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -