- Advertisement -
మండల అధ్యక్షుడు ఎమ్మార్ నరసింహారావు
నవతెలంగాణ – జన్నారం
మేదరులు, (మహేంద్రలు) ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరని మేదర సంఘం జన్నారం మండల అధ్యక్షుడు ఎమ్మార్ నరసింహారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మేదర సంఘ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18న ఉదయం 8 గంటలకు ప్రతి మేదరి కులస్థుడు మండల కేంద్రంలోని మహేంద్ర సంఘ భవనానికి చేరుకుని, ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కోడి జుట్టు రాజన్న అశోక్, అంజన్న రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -