- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో నూతనంగా గ్రామానికి వచ్చిన అధికారులు ఐకెపి అధికారి స్వాతి, జిపిఓ దత్తు, జ్యోతి లను గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. అలాగే గ్రామ గౌడ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన సూర్య ప్రకాష్ గౌడ్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నరేష్, పిఎసిఎస్ చైర్మన్ సిద్ధ రాములు, మాజి సర్పంచ్ నర్సింలు యాదవ్, మండల జనరల్ సెక్రెటరీ ప్రకాష్, నాయకులు రామస్వామి, ప్రవీణ్ గౌడ్, రమేష్, తదితరులు ఉన్నారు.
- Advertisement -