- Advertisement -
నవతెలంగాణ గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలను బుధవారం మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సృజన్ కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మమత, మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల స్పెషల్ ఆఫీసర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం స్వీకరించారు. జాతీయ గీతం తో పాటు జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించారు. అనంతరం హాజరైన వారందరికీ ఆయా కార్యాలయాల్లో స్వీట్స్ పంపిణీ చేశారు.
- Advertisement -