- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హస్నాబాద్ మండలంలోని గాంధీ నగర్ గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పథకంలో కూలికి వెళ్తున్న కూలీలకు టెక్నికల్ అసిస్టెంట్ పరశురాములు, ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్ ఈకేవైసీ చేశారు. ఈ సందర్భంగా టీ ఏ పరశురాములు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కూలికి ఫోన్ ద్వారా ఈకేవైసీ చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -