- Advertisement -
అనసూయమ్మ ట్రస్ట్ డైరెక్టర్ బండ శ్రీకాంత్
నవతెలంగాణ – మల్హర్ రావు
చంద్రుపట్ల అనసూయమ్మ చారిటెబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్లలో రేపు ఆదివారం రెనీ హాస్పిటల్ మంథని, రుద్ర, సత్యం బాబు పిల్లల హాస్పిటల్ గోదావరిఖనిలచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనట్లుగా ట్రస్ట్ డైరెక్టర్ బండ శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరంలో చిన్న పిల్లల, ఎముకల, షుగర్, బీపీ తదితర వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
- Advertisement -