- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామంలో వీడిసి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినారు. జిల్లా కేంద్రానికి చెందిన కంటి ఆసుపత్రి వైద్యులు టి శ్రీనివాస్ బృందం చే కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలను రోగులకు పంపిణీ చేసినారు. 1 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు కుంట గంగారెడ్డి, సభ్యులు వినోద్ రెడ్డి , బాజన్న, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -