- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధి చౌదర్ పల్లి లోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, పోషక విలువల ఆహారం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దివ్య, వైద్య సిబ్బంది వేణు, పుష్ప, పలువురు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -