- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం మల్లారం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2008-2009 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు బుధవారం పాఠశాలలో గెట్టుగెదర్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నెమరు వేసుకున్నారు. విద్య బుద్ధులు నేర్పిన అప్పటి గురువులను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -