- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సభ్యునిగా ఎల్బీ లక్ష్మికాంత్ రాథోడ్ బుధవారం హైదరాబాద్లో బాధ్యతలను స్వీకరించారు. ఆయనతో టీజీపీఎస్సీ చైర్మెన్ బుర్రా వెంకటేశం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో టీజీపీఎస్సీ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, పాల్వాయి రజనీకుమారి, కార్యదర్శి ప్రియాంక అల తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -