- Advertisement -
వాయినాలు ఇచ్చుకున్న సుహాసినిలు
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ లో గురువారం పోలీస్ సిబ్బంది కుటుంబాలు దేవి ఆలయం వద్ద ఒకచోట కలిసి ఒకరి నొకరు గాజులు వేసుకొని కొత్త చీరలు వాయనం ఇచ్చుకున్నారు. చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -