- Advertisement -
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని సౌలతండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న 4 అంగన్వాడి సెంటర్ల టీచర్లు ఘనంగా పోషణ మాసం నిర్వహించినట్లు ఆ సెంటర్ టీచర్లు కే పద్మ పి ఉమారాణి డి కవిత సుగుణ తెలిపారు. గురువారం బాడువా తాండాలో పోషకాలపై గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కిశోర పిల్లలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆడి శ్రమదానం నిర్వహించి గ్రామంలో ప్రజలకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయాలు సరోజన కవిత మంజుల సునీత ఆశ వర్కర్ కవితా పాల్గొన్నారు.
- Advertisement -