- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన ముగ్గురికి 2 రోజుల జైలు శిక్ష పడిందని, 5 గురికి జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 8 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరచగా ఐదుగురికి రూ.8500/- విధించగా నీలవేణి శామ్సన్, శిరవేణి నరేందర్, కుంకి బాబు లకు 2 రోజుల జైలు శిక్ష పడిందని తెలిపారు.
- Advertisement -