- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్ట్ శుక్రవారం సాయంకాలం 6 గంటల సమయంలో రెండు గేట్లనసి దిగువకును నీటి విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. కౌలాస్ నాళా ప్రాజెక్టుకు 3172 క్యూసెక్కుల నీరు ఎగువ నుండి ప్రాజెక్టులోకి వచ్చి చేరిందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 అడుగులు కాగా.. ప్రస్తుతము 457. 80 అడుగుల వరకు నీరు చేరింది. ఎగువ నుండి నీరు భారీగా వస్తుండడంతో శుక్రవారం రెండు గేట్లను ఎత్తివేసి దిగువకు 3172 క్యూసెక్కుల నీరు వదులుతున్నామన్నారు.
- Advertisement -