- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామంలో భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ 118 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలిచి స్వాతంత్ర పోరాటంలో వీరమరణం పొందిన యోధులలో భగత్ సింగ్ ప్రథముడని అన్నారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -