- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో జలవనరుల శాఖ అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 5.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 69 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
- Advertisement -