- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మహిళ తన యొక్క ఒక సంవత్సరం పాపతో అదృశ్యం అయినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ ఆదివారం తెలిపారు. ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామానికి చెందిన స్వప్న (36) గ్రామం నుండి శనివారం ఉదయం 10 గంటలకి భర్తతో చిన్న గొడవ వల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోవడం జరిగింది అని తెలిపారు. వెళ్లేటప్పుడు తన ఒక సంవత్సరం పాపను కూడా తీసుకొని వెళ్లిందని, భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఎవరికైనా కనబడితే ఎస్ హెచ్ ఓ 8712659858, ఎస్సై 8712578207, పిఎస్ 8712659752 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
- Advertisement -