నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవ కార్యక్రమం నిర్వహించినారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఇతర నాయకులు మాట్లాడుతూ.. మహారాష్ట్ర లోని నాగపూర్లో 1925లో విజయదశమి నాడు మొదలు పెట్టారు. ప్రారంభ ప్రేరణ హిందూ క్రమశిక్షణ ద్వారా పాత్ర శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. స్వాతంత్య్రానంతర 1948 లో గాంధీ హత్యకు ఆర్ ఎస్ ఎస్ కు సంబంధం ఉంది అనే ఆరోపణలతో ప్రభుత్వం నిషేధించింది. అప్పుడు, ఎమర్జెన్సీ సమయంలో (1975-1977), 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత మూడవసారి నిషేధాజ్ఞలు విధించడం జరిగినా కాని తరువాత ఎలాంటి ఆధారాలు లేని కారణంగా నిషేధాన్ని ఎత్తివేసింది అని హిందూ జాతీయవాద ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలోఆర్ఎస్ ఎస్ విభాగ కార్యదర్శి వెంకట శివకుమార్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంకాపూర్ లో విజయదశమి ఉత్సవ కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES