నవతెలంగాణ – హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో భారత్, శ్రీలంక గువాహటి వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. స్వదేశంలో ఆడుతున్న భారత మహిళల జట్టు, ఇటీవలి ప్రదర్శన ఆధారంగా భారీ అంచనాల మధ్య బ్యాటింగ్ ప్రారంభించింది. గతంలో రెండు సార్లు ఫైనల్ చేరినా విజయం సాధించలేని భారత్, ఈసారి విజయం సాధిస్తుందో లేదు చూడాలి.
భారత జట్టు : కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వికెట్కీపర్ రిచా ఘోష్, ప్రతికా రావల్, స్మృతి మందన, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
శ్రీలంక జట్టు: కెప్టెన్ చమరి ఆటపట్టు, వికెట్ కీపర్ అనుష్క సంజీవని, హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అచ్చిని కులసూర్య, సుగందిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోక రణవీర.