- Advertisement -
నవతెలంగాణ – ధర్మసాగర్
ఏఎస్ఐ గా ధర్మసాగర్ పరిధిలో పనిచేస్తున్న దాసరి సమ్మిరెడ్డిని హనుమకొండ సిపి సన్ ప్రీత్ సింగ్ ఎస్సైగా పదోన్నతి కల్పించినందుకు మంగళవారం స్థానిక పత్రిక విలేకరులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు ఘనంగా ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 37 సంవత్సరాలు వివిధ ప్రాంతాలలో నా వంతు పోలీస్ విధులను నిర్వర్తించినందుకు ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు ఎస్సైగా పదోన్నతి కల్పించినందుకు సంతోషిస్తున్నానన్నారు. కార్యక్రమంలో బొడ్డు కర్యప్ప, పొలిమేర గోపాల్, ఇసంపల్లి రమేష్, గజ్జల సుమన్, నాగవల్లి దుర్గరాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -