- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి దంపతులకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2013లో వీరిద్దరూ లవ్ మ్యారేజీ చేసుకోగా ఒక కూతురు ఉంది. గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్న వీరు ఈ ఏడాది మేలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూతురు సైంధవి వద్ద ఉండేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకాశ్ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు.
- Advertisement -