- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన పోలే చంద్రశేఖర్ బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇవాళ ఉదయం డాలస్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందాడు. ఎల్బీనగర్లో ఉన్న బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, మాజీమంత్రి హరీశ్రావు పరామర్శించారు.
- Advertisement -