- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
మండలంలోని రాంపూర్ డి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్ సి సి కేడెట్లు బి.అభినమ్, ఎం. అక్షయ్ సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి ట్రెక్కింగ్ క్యాంపు ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎన్ సి సి అధికారి సెకండ్ ఆఫీసర్ శ్రీనివాఫ్ ఖత్రి తెలిపారు. కేడెట్లను మాధవ్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సర్టి ఫికెట్లును ప్రదానం చేశారు.ఎన్ సి సి క్యాంపులు జాతీయతా భవాన్ని పెంపొందిస్తాయని మున్ముందు మరిన్ని క్యాంపు లను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తు వారికి అభినందించారు.
.
- Advertisement -