రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఈనెల 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ, ‘ఇందులో ఉన్న ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో రాలేదు. శ్రీమాన్ చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. గోదావరి జిల్లాల్ని అద్భుతంగా చూపించిన సాయి కుమార్ పనితనం గురించి అందరూ చెప్పుకుంటారు. గౌరీ క్యాస్టూమ్స్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. కోమలి అద్భుతమైన నటి. తేజ, అభిలాష్కి మంచి సక్సెస్ రావాలి. కెమెరామెన్ సాయికి ఆల్రెడీ ప్రశంసలు వస్తున్నాయి.
అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆనందంతో బయటకు వస్తారు’ అని తెలిపారు. ‘సినిమాటోగ్రాఫర్ సాయి కుమార్ నాకు మంచి విజువల్స్ ఇచ్చారు. నేను రాసుకున్న కథను అందమైన పెయింటింగ్లా మార్చాడు. శర్వా, అనుదీప్ నాకు మంచి మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు. నేను ఎంత అందంగా రాసుకున్నానో.. అంతకు మించి అనేలా కోమలి నటించారు. కథ చెప్పిన వెంటనే శ్రీమాన్ ఓకే చేశారు. ఆయన చేసిన సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ చెప్పుకుంటారు. గ్యారీ ఎడిటింగ్ అందరికీ నచ్చుతుంది’ అని డైరెక్టర్ సాయి మోహన్ చెప్పారు.
నిర్మాత అహితేజ మాట్లాడుతూ, ‘ఆడియెన్స్కి మంచి అనుభూతిని ఇవ్వాలని ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ మూవీ ఏ ఒక్కరినీ కూడా నిరాశపర్చదు. కంటెంట్ మీద మా అందరికీ నమ్మకం ఉంది. సినిమా పూర్తి కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయి. నన్ను నమ్మిన డిస్ట్రిబ్యూటర్లందరికీ ధన్యవాదాలు. మా మూవీ ట్రైలర్ అందరికీ నచ్చింది. ‘శశివదనే’ లాంటి క్లైమాక్స్ను నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇంత వరకు చూడలేదు. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్గా నిలిచిన ఎస్కేఎన్కి, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అనీష్, డైరెక్టర్ యోగికి థ్యాంక్స్’ అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ మాట్లాడుతూ,’గౌరీ, అహితేజ ఎంతో ప్యాషనేట్గా ఈ మూవీని నిర్మించారు. ట్రైలర్ అందరికీ రీచ్ అయింది. సినిమా కూడా అందర్నీ మెప్పిస్తుంది’ అని అన్నారు.
అశ్లీలతకు తావు లేని మంచి సినిమా
- Advertisement -
- Advertisement -