- Advertisement -
హైదరాబాద్ : తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఆసూస్ దేశవ్యాప్తంగా తమ రిటైల్ చెయిన్ను వేగంగా విస్తరిస్తోంది. న్యూమలక్పేట్లో కొత్త స్టోర్ను తెరిచినట్టు పేర్కొంది. దీంతో హైదరాబాద్లో తమకు ఇది 7వ స్టోర్ అని ఆ కంపెనీ ఇండియా హెడ్ జిగేష్ భన్సర్ తెలిపారు. ఈ కొత్త స్టోర్ను 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ తమ ల్యాప్టాప్లు, గేమింగ్ డెస్క్టాప్లు, ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్లు, యాక్సెసరీలు సహా విస్తృత శ్రేణీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్ లభ్యం అవుతాయన్నారు.
- Advertisement -