ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన చింతల శ్రీనివాస్ ముదిరాజ్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ సాంస్కతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదని, చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా విజయదశమి దసరా పండుగను జరుపుకుంటామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. ఈ పండుగకు శుభసూచికంగా పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణలో ప్రత్యేకమని తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి అంబర్పేటలో బీజేపీ సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్ ముదిరాజ్ జమ్మి ఇచ్చి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏడెల్లి అజయ్ కుమార్, సెంట్రల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కిన్నెర మేశ్ యాదవ్, బీజేపీ నాయకులు కెంచె చంద్రశేఖర్, ఎడెల్లి భాస్కర్, రాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు.
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES