- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి సమీపంలోని ఓ ఫామ్హౌస్లో దసరా సెలవుల్లో గెట్ టుగెదర్ కోసం కలుసుకున్న 13 మంది విద్యార్థుల్లో ఇద్దరు స్విమ్మింగ్ ఫుల్లో మునిగి మృతి చెందారు. రిషిక్ (17), హర్షవర్ధన్ (17) ఈత రాక మృతి చెందారు. రిషిక్ ని కాపాడేందుకు వెళ్లి హర్షవర్ధన్ కూడా మృతి చెందాడు. పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. వీరంత పదో తరగతి ఒకే చోట చదివి ఇప్పుడు ఇంటర్ 2వ సంవంత్సరం చదువుతున్నారు.
- Advertisement -