Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిద్దులగుట్టపై అన్నదాన కార్యక్రమం 

సిద్దులగుట్టపై అన్నదాన కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని సిద్దుల గుట్ట పైన  సోమవారం  భక్తులు అధిక  సంఖ్యలో విచ్చేసి శివాలయంలో ఆ నవనాథ సిద్దేశ్వరానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి రామాయణం దత్తాత్రేయ ,దుర్గామాత, అయ్యప్ప ఆలయలలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. శ్రీ నందీశ్వర్ మారాజ్ ఆధ్వర్యంలో రామాయణం నుండి భజన భక్తులు భక్తి గీతాలు కోరుకుంటూ కోనేరు వరకు వెళ్లి అక్కడ నందీశ్వర్ మారాజు  కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తిరిగి రామాయణం దగ్గర రావడం జరిగింది. గుట్ట విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి సుమన్ పిసి గంగారెడ్డి మల్లయ్య చరణ్ రెడ్డి, జిమ్మి రవి సంధ్య బట్టు శంకర్ చంద్ర శ్రీనివాస్ ప్రశాంత్ గౌడ్ కొంతం మంజుల మురళి అజారి సతీష్ అని శెట్టి నరేష్ రామా గౌడ్ సిద్ధిరగుట్ట సేవా భక్తులు భక్తులందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -