- Advertisement -
మండలి చైర్మెన్ గుత్తా, డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్ కూడా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బార్బడోస్ దేశ రాజధాని బ్రిడ్జి టౌన్లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి నార్త్ అమెరికాకు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్, రాష్ట్రాల స్పీకర్లు, చైర్మెన్లతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్. వి నరసింహాచార్యులు, అధికారులు ఉన్నారు.
- Advertisement -