- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఆదివారం మండల పరిధిలోని రేగులపల్లి,గుగ్గీళ్ల గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ సుధీర్, ఏపీవో పర్షరాములు, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు గూడెల్లి శ్రీకాంత్,బైర సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -