- Advertisement -
నవతెలంగాణ – పెబ్బేరు
పెబ్బేరు మండలం గుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని వివిధ అభివృద్ధి పనుల మరమ్మత్తులకు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ భూజల భువనేశ్వర్ రెడ్డి విరాళంతో డయాస్ నిర్మాణం, కాంపౌండ్ వాల్ మరమ్మతులు, విద్యార్థులకు ఆర్వో వాటర్ ప్లాంట్, వైఫై ప్రింటర్ విరాళంగా అందజేశారు. సోమవారం రోజు కాంపౌండ్ వాల్ మరమ్మతులకు సోదరుడు ఖగేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు, ఉపాధ్యాయులు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి రెడ్డి, వెంకట్రాంరెడ్డి, రవి కుమార్ రెడ్డి, సుధాకర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -