- Advertisement -
నవతెలంగాణ – కోహెడ
కోహెడ మండల కేంద్రానికి చెందిన వేల్పుల మల్లయ్య అనే రైతు పాడి గేదే పాము కాటుకు గురై మృత్యువాత చెందింది. ఆదివారం రైతు తెలిపిన వివరాల ప్రకారం రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం కట్టివేయగా ఉదయం వెళ్లి చూసేసరికి పాము కాటుకు గురై 80 వేల విలువగల పాడి గేదే మృత్యువాత చెందిందని బోరున విలపించాడు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.
- Advertisement -



